'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. వస్తూ వస్తూనే హిట్ మోసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్కి ఓ ఫ్రెష్ అండ్ క్రేజీ హీరోయిన్ దొరికిందే అన్న ముచ్చట ఎంతో కాలం నిలవలేదు. రెండో సినిమా 'వినయ విధేయ రామ' నిరాశపరిచింది. ఆ తర్వాత బాలీవుడ్లో 'కబీర్సింగ్' ఆఫర్ రావడం, ఇక అక్కడే తిష్ట వేయడం, ఆ తర్వాత వరుస ఆఫర్లు.. కియారాని ఊపిరి తీసుకోనీయకుండా చేసేశాయి.
ఇక 'కబీర్సింగ్' అక్కడ సంచనలన విజయం అందుకోవడంతో, అమ్మడి తలరాతే మారిపోయింది. అంతకు ముందూ బాలీవుడ్లో ఒకట్రెండు సినిమాల్లో నటించినా కియారా అద్వానీకి టాలీవుడ్కి వచ్చి వెళ్లినాకే బాలీవుడ్లో కాలం కలిసొచ్చింది. అందుకే టాలీవుడ్పై తనకెప్పుడూ గౌరవం ఉంటుందనీ, మళ్లీ మళ్లీ అక్కడ సినిమాలు చేస్తాననీ చెప్పుకొచ్చింది. కానీ, 'కబీర్ సింగ్' తర్వాత ఫుల్ బిజీ అయిపోయింది కియారా అద్వానీ. 'కబీర్ సింగ్' సినిమా టైంలోనే మూడు బిగ్ ప్రాజెక్టులపై కియారా సైన్ చేసింది.
వాటిలో రెండు సినిమాలు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్తోనే కావడం విశేషం. ఇప్పుడు మరో రెండు బిగ్ ప్రాజెక్టులు కియారా సైన్ కోసం ఎదురు చూస్తున్నాయట. వదులుకోలేని అవకాశాలటవి. అందుకే వాటిని ఒప్పుకునే దిశగా కియారా ఆలోచనలు చేస్తోంది. అంటే, ఇప్పట్లో బాలీవుడ్ని వదిలి రాలేనంత బిజీ అన్నమాట. అక్కడ ఒక్క సినిమాలో నటిస్తుంటేనే, సౌత్ సినిమాల్లో నటించడం చాలా కష్టం. అలాంటిది ఇన్ని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ, ఇక సౌత్ సినిమాల్ని లెక్కలోకి తీసుకోవడం అంటే అది జరిగే పని కాదు. సో టాలీవుడ్కి కియారా టాటా, బైబై చెప్పేసినట్లేనేమో.