ముద్దుగుమ్మ కియారా అద్వానీకి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన సినిమా 'కబీర్ సింగ్'. నిజానికి కియారా కెరీర్ని టర్న్ చేసిన సినిమా అది. అదే టైమ్లో ఈ సినిమా కారణంగా కియారా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే, ఆ తర్వాత వచ్చిన 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ కియారా దశ మార్చేసింది. బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్గా కియారాని నిలబెట్టేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి చేరిపోయాయంటే అందుకు కారణం ఈ రెండే. అలాంటిది, 'కబీర్సింగ్'పై కియారా సంచలన వ్యాఖ్యలు చేసింది.
కెరీర్ పరంగా, ఓ నటిగా ఆ సినిమా తనకెంతో స్పెషల్ కానీ, ఓ సాటి మనిషిగా 'కబీర్ సింగ్' తనకూ నచ్చదనీ చెప్పింది. 'కబీర్ సింగ్' సినిమాలో హీరోయిన్ పాత్ర చిత్రీకరణ అలాంటిది. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉంటుంది ఆ పాత్ర. అందుకే సాటి మహిళగా అలాంటి పాత్రల్లో మళ్లీ నటించే సాహసం చేయలేనని కియారా చెప్పింది. తెలుగులో 'భరత్ అనే నేను' సినిమాలో నటించి మెప్పించిన కియారా అద్వానీ తర్వాత 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది కానీ, ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు తెలుగులో నటించాలని కోరిక ఉన్నా, నటించలేనంత బిజీగా బాలీవుడ్లో సెటిలైపోయింది.