2019 స్పెషల్‌: కైరా ఫెయిల్‌ అయినా సమ్‌థింగ్‌ స్పెషలే!

మరిన్ని వార్తలు

'భరత్‌ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కైరా అద్వానీ, 2019లో 'వినయ విధేయ రామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనూహ్యంగా ఈ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందుకోకపోయినా, ఆ ఎఫెక్ట్‌ పెద్దగా ఈ భామపై పడలేదు. కానీ, ఈ సినిమా తర్వాత తెలుగులో కనిపించడం మానేసింది కైరా. అందుకు కారణం బాలీవుడ్‌ నుండి క్యూ కట్టిన ఆఫర్లే. ఒకవేళ తెలుగులోనే ఉంటే స్టార్‌ హీరోయిన్‌ అవ్వదగ్గ అవకాశాలు అమ్మడిలో కనిపించాయి.

 

హీరోయిన్స్‌కి సక్సెస్‌ అనేది ఎంత ముఖ్యమో, ఆ సక్సెస్‌తో పని లేకుండా విపరీతమైన క్రేజ్‌ దక్కించుకున్న ముద్దుగుమ్మ కైరానే అని చెప్పక తప్పదు. తెలుగులో కెరీర్‌ కంటిన్యూ చేసి ఉంటే, ఇప్పుడు ఐదారు క్రేజీ ప్రాజెక్టులతో కైరా డైరీ ఫుల్‌ అయిపోయి ఉండేది. మహేష్‌, ప్రబాస్‌, చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌.. ఇలా స్టార్‌ హీరోస్‌ అందరి సరసనా కైరా అద్వానీకి ఛాన్స్‌ దక్కేది. అయితే, బాలీవుడ్‌లో 'కబీర్‌ సింగ్‌' హిట్‌ కైరా అద్వానీ కెరీర్‌ని టర్న్‌ చేసేసింది. ఒక్క హిట్‌ అమ్మడి దశనే మార్చేసింది. క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది. బాలీవుడ్‌లో ఆ రేంజ్‌లో ఆఫర్స్‌ దక్కించుకోవడమంటే, ఆషా మాషీ విషయం కాదు. అలా 2019 కైరా కెరీర్‌కి బాగా కలిసొచ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS