కెరీర్‌ గురించి కియారా సంచలన వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ కెరీర్‌ చాలా విచిత్రంగా సాగింది. బాలీవుడ్‌లోనే ఈ ముద్దుగుమ్మ సినీ కెరీర్‌ స్టార్ట్‌ అయ్యింది. కానీ, అక్కడ ఒకటీ, అరా చిత్రాలతోనే సరిపెట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంది. వస్తూ వస్తూనే స్టార్‌ హీరోల సరసన చోటు దక్కించుకుంది. తొలి సినిమా 'భరత్‌ అనే నేను' సినిమా హిట్‌తో క్రేజ్‌ దక్కించుకుంది. రెండో సినిమా 'వినయ విధేయ రామ' ఆశించిన రిజల్ట్‌ అందించకపోయినా, టాలీవుడ్‌లో క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌గా పాపులరైంది.

 

సరిగ్గా ఈ సమయంలోనే మళ్లీ బాలీవుడ్‌ నుండి పిలుపు రావడంతో, ఇక అక్కడే సెటిలైపోయింది. కానీ, ఈ సారి ముందులా కాదు, స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి చేరుకుంది. ఇదంతా మన తెలుగు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా దయ వల్లనే అని చెప్పక తప్పదు. 'కబీర్‌ సింగ్‌' సినిమా కియారా అద్వానీ కెరీర్‌ టర్న్‌ చేసింది. ఇక ఇప్పుడు ఐదారు ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులతో క్షనం తీరిక లేకుండా గడుపుతోంది. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల ప్రమోషన్స్‌ ఓ వైపు, నిర్మాణ దశలో ఉన్న సినిమాలు ఇంకో వైపు.. ఇలా కియారా ఫుల్‌ బిజీగా గడుపుతోంది.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ని తలచుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. కెరీర్‌లో నిలదొక్కుకోవాలంటే, అందం ఒక్కటే సరిపోదు.. టాలెంట్‌ కూడా ముఖ్యమని చెప్పింది. కియారా పలికిన ఈ ముద్దు పలుకులు సంచలనంగా మారాయి ఇప్పుడు. అందం, టాలెంట్‌తో పాటు, లక్కీ టైమ్‌ కూడా కలిసి రావాలనేది కొందరు ముద్దుగుమ్మల అభిప్రాయం మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS