బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో రెండు సినిమూలు చేస్తే, అందులో ఒకటి సూపర్ హిట్.. ఇంకోటి డిజాస్టర్. తొలి తెలుగు సినిమా 'భరత్ అనే నేను'తో విజయాన్ని అందుకున్న కైరా అద్వానీ, తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆమెకు 'వినయ విధేయ రామ' సినిమాతో షాక్ తగిలింది. సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ ఆమె మీద ఏమీ పడలేదుగానీ, ఆ తర్వాత బాలీవుడ్లో వచ్చిన ఆఫర్స్ కారణంగా కైరా అద్వానీ మళ్ళీ టాలీవుడ్పై ఫోకస్ పెట్టలేదు.
టాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా కైరా అద్వానీ లైట్ తీసుకుంది. చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ కైరా అద్వానీ తెలుగులో నటించేందుకు సమాయత్తమవుతోందట. 'తెలుగు సినిమాల్లో నటించడం చాలా ప్రత్యేకం. ఎందుకంటే, అక్కడి ప్రేక్షకుల అభిమానం అలాంటిది. టాలీవుడ్లో డెడికేషన్ ఎక్కువ. చాలా వేగంగా సినిమాల నిర్మాణం జరుగుతుంటుంది..' అని చెప్పిన కైరా అద్వానీ, తెలుగు సినిమాల్లో మళ్ళీ నటించాలని తనకూ వుందనీ, ఆఫర్స్ వస్తున్నా.. బాలీవుడ్లో బిజీగా వుండడం వల్ల తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాననీ, అది తప్ప తాను తెలుగులో నటించకపోవడానికి వేరే కారణాలు ఏమీ లేవని అభిప్రాయపడింది. 'అన్నీ కుదిరితే త్వరలోనే తెలుగు సినిమాల్లో కన్పిస్తాను..' అని కైరా చెప్పింది. కానీ, కైరా మాటల్ని నమ్మలేం. రెమ్యునరేషన్ని అమాంతం పెంచేసిన కైరా, అస్సలేమాత్రం టాలీవుడ్ని పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి.