'ఆ' స్టోరీస్‌తో పాపులర్‌ అవ్వాలనుకుంటోందట.!

మరిన్ని వార్తలు

'లస్ట్‌ స్టోరీస్‌' వెబ్‌ సిరీస్‌కి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా కైరా అద్వానీ చెలామణి అవ్వడానికి కారణం ఆ 'లస్ట్‌స్టోరీస్‌' వెబ్‌ సిరీసే. తెలుగులో స్టార్‌ హీరోలు మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌లతో సినిమాలకు సైన్‌ చేశాకనే కైరా అద్వానీ 'లస్ట్‌ స్టోరీస్‌' వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు ఒప్పుకుంది. ఆ వెబ్‌ సిరీస్‌లో నటించినందుకు అప్పట్లో కైరా చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. కానీ, ఆ వెబ్‌ సిరీస్‌తో వచ్చిన క్రేజ్‌తోనే బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లగలిగింది కైరా అద్వానీ.

 

ఇప్పుడీ 'లస్ట్‌ స్టోరీస్‌'ని తెలుగులో రూపొందించేందుకు చాలా మంది తెలుగు డైరెక్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే 'ఓ బేబీ'తో హిట్‌ కొట్టాక, దర్శకురాలు నందినీ రెడ్డి 'లస్ట్‌ స్టోరీస్‌' వెబ్‌ సిరీస్‌ని రూపొందించింది. అమలాపాల్‌ ఈ సిరీస్‌లో నటించింది. ఇటీవలే ఈ షూటింగ్‌ పూర్తయ్యింది. మరోవైపు క్రియేటివ్‌ అండ్‌ యంగ్‌ డైరెక్టర్‌, 'ఘాజీ', 'అంతరిక్షం' వంటి విలక్షణ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి దృష్టి కూడా 'లస్ట్‌ స్టోరీస్‌'పై పడింది. ఈయన కూడా 'లస్ట్‌ స్టోరీస్‌'లోని ఓ పార్ట్‌ని వెబ్‌ సిరీస్‌గా రూపొందించబోతున్నాడట.

 

ఈ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు తెలుగమ్మాయ్‌ ఈషా రెబ్బ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. కైరా అద్వానీ లాంటి వాళ్ల కెరీర్‌ని మలుపు తిప్పిన 'లస్ట్‌ స్టోరీస్‌' మన తెలుగమ్మాయ్‌ కెరీర్‌ని కూడా టర్న్‌ చేస్తుందా.? చూడాలి మరి. ఈషా రెబ్బ నటించిన 'రాగల 24 గంటల్లో' అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS