'మహర్షి' ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చేస్తోంది.!

మరిన్ని వార్తలు

భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న 'మహర్షి'కి సంబంధించి మహేష్‌ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ తప్ప మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ రాలేదింతవరకూ. దాంతో మహేష్‌ ఫ్యాన్స్‌ చాలా డిజప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. అందుకే ఫ్యాన్స్‌ని శాటిస్‌ఫై చేసేందుకు రెడీ అయ్యాడు మహేష్‌. ఈ నెల 29న 'మహర్షి' ఫస్ట్‌ ఆడియో సింగిల్‌ని రిలీజ్‌ చేయబోతున్నామంటూ ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశాడు. ఈ పోస్టర్‌లో సినిమాలో కీలక పాత్రధారులైన మహేష్‌బాబు, పూజాహెగ్దే, అల్లరి నరేష్‌ కనిపిస్తున్నారు.

అయితే వెనక్కి తిరిగి నిలబడ్డారు. కనుచూపు మేరలో నీళ్లు తప్ప ఇంకేమీ లేని సుందరమైన సముద్రం ఒడ్డు, ఆ ఒడ్డుపై నీదో దరి, నాదో దరి అన్నట్లుగా నిలబడిన ఈ ముగ్గురుతో పాటు, మూడు సైకిళ్లు కనిపిస్తున్నాయి ఈ పోస్టర్‌లో. పోస్టర్‌ అయితే చాలా చాలా బాగుంది. కానీ వారి ముఖ చిత్రాలే కనబడకుండా జాగ్రత్త పడింది చిత్ర యూనిట్‌. అయితే 29న రాబోయే 'చోటే చోటే బాతే..' ఆడియో సింగిల్‌తో పాటు, కొన్ని వీడియో క్లిప్స్‌ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేవు. సో ఒకవేళ వస్తే, ఆ రకంగా ఫ్యాన్స్‌ పండగ చేసుకోవాలన్న మాట.

ఈ సినిమాలో మహేష్‌బాబు, అల్లరినరేష్‌ స్నేహితులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వనీదత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS