తెలుగు చిత్రసీమకు జేమ్స్ బాండ్ కథల్ని పరిచయం చేసిన ఘనత.. సూపర్ స్టార్ కృష్ణకు దక్కుతుంది. మహేష్బాబుని జేమ్స్ బాండ్ తరహా కథల్లో చూడాలని కృష్ణ ఆశపడ్డారు. కానీ ఇప్పటి వరకూ తీరలేదు. త్వరలోనే ఆ కల నిజం కాబోతోందని సమాచారం.
మహేష్ బాబు కథానాయకుడిగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. వేసవిలో ఈ చిత్రం పట్టాలెక్కబోతోంది. మహర్షి తరవాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. కథ ఇప్పటికే సిద్ధమైందని టాక్. ఇది గూఢచారి టైపు కథ అని తెలుస్తోంది. మహేష్ జేమ్స్ బాండ్ తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాల తరహాలో చాలా స్టైలీష్గా ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారని బడ్జెట్ దాదాపుగా 150 కోట్ల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. మహేష్ సైతం ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనున్నాడని సమాచారం.