సోషల్‌ మీడియాపై మిల్కీ బ్యూటీ అభిప్రాయమిదే.!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా పుణ్యమా అని, ప్రపంచ చాలా చిన్నదైపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సోషల్‌ మీడియా బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఒకప్పుడు సెలబ్రిటీలు ప్రేక్షకులకు దగ్గరవ్వాలంటే చాలా కష్టమైన పని. కానీ, ఇప్పుడు నెట్టింటి పుణ్యమా అని, చాలా తొందరగా దగ్గరవుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో సంపత్‌నంది తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్‌గా నటిస్తోంది.

 

ఇటీవలే 'సరిలేరు..' సినిమాలో 'డాంగ్‌ డాంగ్‌..' సాంగ్‌తో ఓ ఊపు ఊపేసిన తమన్నా, తన మనసులోని మరో మాటని బయటపెట్టింది. అదే హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ గురించి. ఇంతవరకూ చాలాసార్లు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల అవకాశాలు వచ్చినా తమన్నా అటు వైపు మొగ్గు చూపలేదు. ఎక్కువగా గ్లామర్‌ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కానీ, 'సైరా' సినిమాలో తమన్నా పోషించిన 'లక్ష్మి' పాత్ర ఆమెను పూర్తిగా మార్చేసిందట. తానూ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రల్లో కనిపించాలనుకుంటున్నానన్న సీక్రెట్‌ బయట పెట్టింది. అంతేకాదు, డాన్స్‌ ప్రధానాంశంగా సాగే చిత్రంలో నటించాలని ఉందని హింట్‌ కూడా ఇచ్చింది. అన్నట్లు ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఆల్రెడీ స్టార్ట్‌ అయ్యాయట. అంటే, తమన్నా లీడ్‌ రోల్‌లో త్వరలోనే సినిమా ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS