జియో ప్రచారానికి రెడీ అవుతున్న సూపర్ స్టార్

మరిన్ని వార్తలు

తెలుగు స్టార్ హీరోలలో చాలామంది కార్పొరేట్ బ్రాండ్స్ కు ప్రచారం చేస్తారు. అయితే మహేష్ ఖాతాలో ఉన్న బ్రాండ్స్ ఎక్కువ. పలు కార్పొరేట్ సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించే మహేష్ బాబు ఈమధ్య రిలయన్స్ సంస్థకు చెందిన జియో తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం టెలికాం రంగంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ జియో వారు దేశవ్యాప్తంగా కొందరు టాప్ స్టార్ హీరోలతో ప్రమోషన్ చేసేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే మహేష్ బాబు తో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

జియో విస్తరణలో భాగంగా కొన్ని కొత్త పథకాలను ప్రవేశ పెట్టే ఆలోచనలో రిలయన్స్ వారు ఉన్నారట. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటనలను షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారట. త్వరలోనే మహేష్ బాబుతో కూడా ప్రచార ప్రకటనలను రూపొందిస్తున్నారని సమాచారం. గత కొన్ని నెలలుగా షూటింగులకు దూరంగా ఉన్న మహేష్ బాబు త్వరలోనే ఈ ప్రకటనల కోసం కెమెరా ముందుకు రానున్నారని సమాచారం అందుతోంది. మరి ఈ అడ్వర్టైజ్మెంట్లను భారీ స్థాయిలో షూట్ చేస్తారా లేదా ఇండోర్ లో రిస్క్ లేకుండా షూట్ చేస్తారా అనేది వేచి చూడాలి.

ఇదిలా ఉంటే మహేష్ బాబు కొత్త సినిమా 'సర్కారు వారి పాట' కు జోరుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సాగుతోంది. కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన వెంటనే షూటింగును ప్రారంభించేందుకు పరశురామ్ టీమ్ సన్నాహాలు చేసుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS