మ‌హేష్ పైనే ఆశ‌లు పెట్టుకున్న ఎన్టీఆర్‌

మరిన్ని వార్తలు

ఈత‌రం స్టార్ల‌కు వెండి తెర - బుల్లి తెరంటూ బేధం లేదు. ఎక్క‌డైనా స‌రే, త‌మ మార్క్ చూపిస్తున్నారు. ఎన్టీఆర్ నే చూడండి. బిగ్ బాస్ హోస్ట్ గా అద‌ర‌గొట్టాడు. ఇప్పుడ `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు` అంటూ మ‌ళ్లీ టీవీల్లో సంద‌డి చేయ‌డం మొద‌లెట్టాడు. జెమినీలో ప్ర‌సారం అవుతున్న కార్య‌క్ర‌మం ఇది. ఎన్టీఆర్ హోస్ట్ కావ‌డంతో అంద‌రి దృష్టీ దీనిపై ప‌డింది. రామ్ చ‌ర‌ణ్ తో ఎపిసోడ్ చేసి, మంచి రేటింగులే సంపాదించుకున్నారు. అయితే క్ర‌మంగా.. ఈ షోకి రేటింగులు ప‌డిపోయాయి. బిగ్ బాస్ ఎఫెక్ట్‌, ఆమ‌ధ్య ఐపీఎల్ ఎఫెక్ట్ ఈ షోపై గ‌ట్టిగా ప‌డ్డాయి. పైగా.. చ‌ర‌ణ్‌, స‌మంత త‌ప్ప పెద్ద‌గా సెల‌బ్రెటీలూ రాలేదు. దాంతో... షో క‌ళ త‌ప్పిన‌ట్టైంది.

 

దాంతో ఎన్టీఆర్ కాస్త గుర్రుగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఈ షోకి స‌రైన రీతిలో ప్ర‌చారం చేయ‌లేద‌ని ఎన్టీఆర్ భావిస్తున్నాడ‌ట‌. అందుకే రేటింగులు లేవ‌న్న‌ది త‌న ఫీలింగ్. నిజానికి ఎగ్రిమెంట్ చాలా రోజులే ఉన్నా, ముందుగానే ఈ షో పూర్తి చేసి, బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ట‌. ఇక మీద‌ట‌.. ఈ షో ఎన్టీఆర్ చేయ‌డ‌ని, టీవీ హోస్ట్ గా తాను ఇక మీద‌ట క‌నిపించే అవ‌కాశం లేద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. మ‌హేష్ బాబుతో తార‌క్ ఓ ఎపిసోడ్ చేశాడు. అది దీపావ‌ళికి ప్ర‌సార‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఆ ఎపిసోడ్ కి రేటింగ్స్ పీక్స్ లో ఉండే ఛాన్సుంది. దాంతోనైనా ఎన్టీఆర్ అస‌హ‌నం కాస్త త‌గ్గుతుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS