వ‌ద్ద‌న్న ద‌ర్శ‌కుడితోనే మ‌ళ్లీ ప‌నిచేస్తాడా?

మరిన్ని వార్తలు

`గీత గోవిందం` తో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు ప‌ర‌శురామ్‌. ఆ వెంట‌నే మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేద్దామ‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేశాడు. ఓ క‌థ కూడా చెప్పాడు. కానీ అదెందుకో వ‌ర్క‌వుట్ కాలేదు. మ‌హేష్ కోస‌మే దాదాపుగా ఆరు నెల‌లు వృధా చేసుకున్న ప‌ర‌శురామ్ - చివ‌రికి ఏదీ తేల‌క‌పోవ‌డంతో ఆ సినిమాని ప‌క్క‌న పెట్టేసింది. అయితే ఇప్పుడు మ‌రోసారి మ‌హేష్ తో సినిమా చేసే ఛాన్సు ద‌క్కింది. మ‌హేష్‌కి అడ్వాన్స్ ఇచ్చి, స‌రైన క‌థ కోసం వెదుకుతోంది మైత్రీ మూవీస్‌. ప‌ర‌శురామ్ అయితే... 14 రీల్స్ ప్ల‌స్‌కి సినిమా చేయాలి. ఈ రెండు సంస్థ‌లూ క‌లిసి మ‌రోసారి మ‌హేష్ - ప‌ర‌శురామ్ మ‌ధ్య మీటింగ్ ఏర్పాటు చేయ‌నున్నాయి.

ఈసారి అన్నీ కుదిరితే.. ఈ కాంబో ప‌క్కా అయ్యే ఛాన్సుంది. నిజానికి ప‌ర‌శురామ్ - నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో ఇటీవ‌లే ఓ సినిమా సెట్ట‌య్యింది. దీనికి 'నాగేశ్వ‌ర‌రావు' అనే పేరు కూడా ఫిక్స్ చేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప‌నుల్లోనే ఉన్నాడు ప‌ర‌శురామ్‌. అయితే వంశీ పైడిప‌ల్లి సినిమా కాన్సిల్ అవ్వ‌డంతో ఊహించిని ఛాన్స్ వ‌చ్చింది ప‌ర‌శురామ్‌కి. మ‌హేష్‌తో సినిమా ఓకే అయితే గ‌నుక‌... నాగేశ్వ‌ర‌రావు స్క్రిప్టుని, చైతూ సినిమానీ ప‌క్క‌న పెట్టాల్సివ‌స్తుంది. అయితే అదేం పెద్ద మేట‌ర్ కాదు ప‌ర‌శురామ్‌కి. ఇప్పుడు కాల్ తీసుకోవ‌డం మ‌హేష్ చేతుల్లోనే ఉంది. లేదంటే.... త‌న‌కు కావ‌ల్సిన ద‌ర్శ‌కుడు దొరికేంత వ‌ర‌కూ మ‌హేష్ ఖాళీగా ఉండాల్సివ‌స్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS