త్రివిక్ర‌మ్ ఇంకా రాస్తూనే ఉన్నాడా?

మరిన్ని వార్తలు

మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాంబోలో వ‌చ్చే హ్యాట్రిక్ సినిమా ఇది. అందుకే అంచ‌నాలు భారీగా ఉన్నాయి. `స‌ర్కారు వారి పాట‌` త‌ర‌వాత మ‌హేష్ చేయ‌బోయే సినిమా ఇదే. `అల వైకుంఠపుర‌ములో` త‌ర‌వాత‌.. త్రివిక్ర‌మ్ చేస్తున్న సినిమా కూడా ఇదే. ఈపాటికే షూటింగ్ కూడా మొద‌లవ్వాల్సింది. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి హ‌డావుడీ లేదు. ఈ సినిమా కోసం క‌థ ఇంకా సిద్ధం కాలేద‌ని... త్రివిక్ర‌మ్ వెర్ష‌న్ల మీద వెర్ష‌న్లు రాస్తూనే ఉన్నాడ‌ని, అందుకే ఈ సినిమా ఇంకా ప‌ట్టాలెక్క‌లేద‌ని స‌మాచారం. ఇది వ‌ర‌కే మ‌హేష్ కి `లైన్‌` చెప్పేశాడు త్రివిక్ర‌మ్. అయితే ఆ క‌థ‌పై ఇంకా క‌స‌ర‌త్తులు జ‌రుగుతూనే ఉన్నాయ‌ట‌.

 

స్వ‌త‌హాగా త్రివిక్ర‌మ్ చాలా ఫాస్ట్‌. క‌థ ఆలోచించాడంటే.. నెల రోజుల్లో స్క్రిప్టు మొత్తం అయిపోతుంది. కానీ ఈసారెందుకో లేట్ అవుతోంది. `స‌ర్కారు వారి పాట‌` అవ్వ‌గొట్ట‌డానికి ఇంకా స‌మ‌యం ఉండ‌డం, `అయ్య‌ప్ప‌యున్ కోషియ‌మ్` రీమేక్ బాధ్య‌త‌లు నెత్తిమీద ప‌డ‌డంతో.. మ‌హేష్ సినిమాకి టైమ్ కేటాయించ‌లేక‌పోతున్నాడ‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS