మహేష్-పవన్ ఫ్యాన్స్ మధ్య కథ ముగిసినట్టేనా?

మరిన్ని వార్తలు

గత రెండు మూడు నెలలుగా కొనసాగుతున్న మహేష్ కత్తి-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య సాగుతున్న వివాదానికి ఒక ముగింపు వచ్చింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నిన్న రాత్రి జరిగిన పరిణామాలని ఒకసారి పరిశీలిస్తే, మహేష్ కత్తిపైన దాడికి పాల్పడినవారు ఆయన ముందుకి వచ్చి క్షమాపణ చెప్పడంతో పాటుగా తన ఫ్యాన్స్ ఇతరులు చేసే విమర్శలకు ప్రతిస్పందించ వద్దు అని పవన్ కళ్యాణ్ పేరిట ఒక లేఖ విడుదల అయింది.

అయితే దాడి జరిగింది కాబట్టి, పవన్ కళ్యాణ్ తనకి క్షమాపణ చెప్పవలసిందే అని డిమాండ్ చేశారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది మధ్యవర్తిత్వం చేయడంతో ఆయన రాజీకి ఒప్పుకున్నాడు.

ఆ వెంటనే వారందరూ కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నిన్న ఉదయం మహేష్ కత్తి పెట్టిన కేసుని ఉపసంహరించుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది అన్న అభిప్రాయం వచ్చింది.

ఇక కేసు ఉపసంహరించుకున్న తరువాత వెంటనే అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ కత్తితో సేల్ఫీలు దిగడం, స్వీట్లు పంచుకోవడం వంటివి చేశారు. అరె.. మేమ్ మేమ్ ఫ్రెండ్స్ రా భాయి అంటూ అనుకోవడం కూడా కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS