పరువు హత్య పై స్పందించిన హీరో మనోజ్

మరిన్ని వార్తలు

మొన్న శుక్రవారం నాడు మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యకి సంబంధించిన వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది.

ఈ ఘటనలో ప్రణయ్ అనే యువకుడిని మారుతీరావు అనే వ్యక్తి తన అభీష్టానికి వ్యతిరేకంగా తన కూతురిని పెండ్లి చేసుకున్నందుకు కిరాయి హంతకుడి చేత అతికిరాతకంగా చంపించాడు. ఇప్పుడు అతను పోలిసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం.

ఇక ఈ దిగ్బ్రాంతి కలిగించే ఘటన పైన సామాన్య ప్రజానీకంతో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పరువు హత్యని తీవ్రంగా ఖండిస్తున్నారు. కులాంతర వివాహం చేసుకుంటే చంపేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ కూడా ఈ అంశం పైన తీవ్రంగా స్పందించాడు. కుల వివక్షని అందరు కలిసి ఎదురుకుందాము అని ఈ క్రింది విధంగా పిలుపునిచ్చారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS