ఎన్నికల ప్రచారానికి 'మెగా' సైన్యం.!

మరిన్ని వార్తలు

వారం రోజుల పాటు మెగా కాంపౌండ్‌ నుండి పలువురు ప్రముఖులు జనసేన పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నారట. చిరంజీవి విషయంలో స్పష్టత లేదు కానీ, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌తేజ్‌, సాయి ధరమ్‌తేజ్‌, నిహారిక తదితరులు ప్రచారంలో దిగనున్నారట. వరుణ్‌తేజ్‌, నిహారికల్ని ఖచ్చితంగా ప్రచారంలో దించుతానని మెగా బ్రదర్‌ నాగబాబు స్పష్టం చేశారు.

ఆల్రెడీ నిహారిక తన సినిమా 'సూర్యకాంతం' ప్రమోషన్స్‌ నిమిత్తం, జనసేన అధినేత బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌పై జనంలో ఉన్న రెస్పాన్స్‌ ఏంటో రీసెర్చ్‌ చేసేస్తోంది. జనసేనకు ఓటేసి గెలిపించమని అభిమానులకు సంకేతాలు ఇస్తోంది. త్వరలోనే ప్రత్యక్ష ప్రచారంలోనూ పాల్గొననుంది నిహారిక. ఇదిలా ఉంటే, మెగా కోడలు ఉపాసన కూడా జనసేన తరపున ప్రచారం చేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటిదాకా ఎన్నికల ప్రచారం కోసం మెగా ఫ్యామిలీ నుండి ఎవ్వరూ రాకపోవడంతో ఫ్యాన్స్‌ డిజప్పాయింట్‌ అవుతున్నారు. ఫ్యాన్స్‌ ఒత్తిడి మేరకు మెగా ఫ్యామిలీ త్వరలోనే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారానికి కాలు దువ్వబోతోందట. ఒకవేళ ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కి మామూలు పండగ కాదు, మెగా పండగే.. ఎనీ డౌట్‌.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS