కూల్‌ కూల్‌గా జనంలోకి 'మెహబూబా'

మరిన్ని వార్తలు

పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో క్రియేటివ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'మెహబూబా'కి ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. సహజంగా సినిమాకి చేసే ప్రమోషన్స్‌ కాకుండా ఇన్నోవేటివ్‌గా ఈ సినిమా ప్రమోషన్స్‌ ప్లాన్‌ చేశారు. అవి జనంలోకి బాగా వెళ్లిపోతున్నాయి. 

అసలే హాట్‌ సమ్మర్‌. ఈ తరుణంలో భానుడి ప్రతాపం తట్టుకోవాలంటే చల్లని వాతావరణం కావాలి. అది దొరకడం ఎలాగూ కష్టమే. అత్యవసరం అయితే తప్ప ఎండలోకి రాని పరిస్థితి. అలా అత్యంత అవసరమై భానుడిని ఎదిరించి బయట తిరుగుతున్న వారి కోసం 'మెహబూబా' టీమ్‌ కూల్‌ కూల్‌గా మజ్జిగ ప్యాకెట్స్‌ని పంచుతున్నారు. ఇలా చేయడంతో ఓ పక్క సోషల్‌ సర్వీస్‌, మరో పక్క సినిమా ప్రమోషన్‌ రెండూ ఏకకాలంలో జరిగిపోతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. 

పూరీ తనయుడు ఆకాష్‌ పూరీ, హీరోయిన్‌ నేహా శెట్ట డైరెక్ట్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. నైతిక బాధ్యతను పెంపొందించే కొన్ని వీడియోలు కంపోజ్‌ చేస్తున్నారు. కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మొన్న టూ వీలర్స్‌ హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి అంటూ ఆకాష్‌, నేహా చేసిన షార్ట్‌ వీడియో అందర్నీ విశేషంగా ఎట్రాక్ట్‌ చేసింది. 

ఇలా ఒక్కటేమిటి, చాలా రకాలుగా ఈ సినిమాని ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ మధ్య పూరీ జగన్నాధ్‌కి అస్సలు టైం కలిసి రావడం లేదు. దాంతో పూరీని ఏ హీరో నమ్మలేకపోతున్నాడు. 'నన్ను ఏ హీరో నమ్మలేదు. కానీ నా కొడుకు నన్ను నమ్మాడు. వాడి నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి..' అని పూరీ చెబుతుండడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో పూరీ బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడా లేదా అనేది చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS