డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను 'కృష్ణార్జున యుద్ధం' చిత్రంతోపాటు ప్రదర్శించనున్నారు.
1700కి పైగా స్క్రీన్స్లో 'మెహబూబా' ట్రైలర్ను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్కి, టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని దిల్రాజు వెంకటేశ్వర ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నారు. మే 11న సమ్మర్ స్పెషల్గా 'మెహబూబా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూరి ఆకాశ్ సరసన నేహాశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.