ఈ ఏడాది సంక్రాంతి రేస్లో పోటీ పడుతున్న ముద్దుగుమ్మలు చాలానే ఉన్నారు. అందరూ 'సరిలేరు నాకెవ్వరూ..' అనే రేంజ్లో పర్ఫామెన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. 'సరిలేరు..'తో రష్మికా మొదట రేస్కి దిగుతుంటే, తర్వాత 'అల వైకుంఠపురములో..' నుండి పూజా హెగ్దే, నివేదా పేతురాజ్ పోటీకి కాలు దువ్వుతున్నారు. వీరితో నేనేం తక్కువా.. నేనూ రేసులోనే ఉన్నా.. అంటూ ముద్దుగుమ్మ మెహ్రీన్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎంట్రీ ఇస్తోంది 'ఎంత మంచి వాడవురా..' సినిమాతో. హీరోయిన్ పదవికి ఈ నలుగురు భామలూ పోటీ పడుతుంటే, మిల్కీ బ్యూటీ తమన్నా 'డాంగ్ డాంగ్..' అంటూ 'సరిలేరు..'లో స్పెషల్ సాంగ్ చేసి, తనదైన శైలిలో హల్చల్ చేస్తోంది.
అలాగే 'ఎంత మంచి వాడవురా..' సినిమాలో నటాషా దోషి స్పెషల్ సాంగ్తో వచ్చేస్తోంది. వీరే కాక, అంతకన్నా ముందే నయనతార, నివేదా థామస్ 'దర్బార్' చిత్రంతో అందరి కన్నా ముందే ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు. ఇలా ఈ ఏడాది సంక్రాంతి ముద్దుగుమ్మలతో కలర్ ఫుల్గా నిండిపోయింది. అయితే రేస్లో పోటీ బలంగానే ఉంది. కానీ, రేస్లో విన్ అయ్యేదెవరు.? ఎవరెవరు పర్ఫామెన్స్తో ఆకట్టుకుంటారు. ఎవరెవరు గ్లామర్ తళుకులతో మత్తెక్కిస్తారు.? అనేది తెలియాలంటే అన్ని సినిమాలూ విడుదలయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.