'గాయత్రి' వచ్చేదెప్పుడంటే!

మరిన్ని వార్తలు

లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మోహన్‌బాబు లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుందని తాజాగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. రొటీన్‌ కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ అట. 

నటనకు పూర్తిగా గ్యాప్‌ ఇవ్వలేదు మోహన్‌బాబు. తరచుగా కాకపోయినా, నటిస్తూనే ఉన్నాడు. కొడుకులు మంచు విష్ణు, మనోజ్‌ సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌లో నటిస్తూ ఉంటాడు. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'రౌడీ' తదితర చిత్రాల్లో నటించాడు. అలాగే అల్లరి నరేష్‌ 25వ చిత్రమైన 'మామ మంచు అల్లుడు కంచు' సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించాడు. ఇంచుమించు హీరోకి ఈక్వెల్‌ క్యారెక్టరే అది. ఆ సినిమాలో చాలా కాలం అలనాటి హీరోయిన్లు రమ్యకృష్ణ, మీనాలతో జత కట్టారు మోహన్‌బాబు. అయితే తాజాగా నటిస్తున్న 'గాయత్రి' సినిమా ఓ ప్రత్యేకమైన సినిమా అట. ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ హీరోగా కనిపించనున్నారు మోహన్‌బాబు. 

అయితే ఈ సినిమాలోనూ మంచు విష్ణు నటిస్తున్నాడు. కానీ ఈ సారి గెస్ట్‌ రోల్‌ విష్ణు పోషిస్తున్నాడట. ముద్దుగుమ్మ శ్రియ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మధ్య విడుదలైన 'గాయత్రి' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ లుక్‌లో ఉన్నది విష్ణు, శ్రియనే. విష్ణు పది తలల రావణాసురుడిలా మాస్క్‌ పెట్టుకున్నాడు. విష్ణు పక్కనే శ్రియ కూడా ఉంది. అయితే ఈ పోస్టర్‌కీ, సినిమా కాన్సెప్ట్‌కీ ఉన్న సంబంధం ఏంటో తెలీదు కానీ, టైటిల్‌ చూస్తే ఇదో ఫ్యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న యాక్షన్‌ మూవీ అనిపిస్తోంది. మదన్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అరియానా - వివియానా - విద్యా నిర్వాణా ప్రెజెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS