'శ్రియా'ని హగ్ అడిగిన మోహన్ బాబు

మరిన్ని వార్తలు

ఈ మధ్యకాలంలో ఆడియో విడుదల వేడుకల్లో, అలాగే ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ లో సదరు సినిమా గురించి సంబంధించి కాకుండా ఇతర అంశాల పై ఎక్కువగా ఫోకస్ చేయటం జరుగుతుంది. ఇలా ఆడియో ఈవెంట్స్ లో అనవసరంగా ఏదో మాట్లాడి కేసులు మీద వేసుకున్న సెలబ్రిటీలు కూడా లేకపోలేదు.

అయితే నిన్న జరిగిన సంఘటన చూస్తే కేసుల వరకు వెళ్ళేంతలా లేదు గాని కొద్దిగా అభ్యంతరకరంగా ఉన్నది అన్న మాట వాస్తవం. ఇంతకీ ఏం జరిగిందంటే- గాయత్రి సినిమాలో నటించిన వారందరి గురించి మాట్లాడుతూ- శ్రియా శరన్ చాలా బాగా నటించింది అని ఇక ఆమెని కౌగిలించుకోవాలి అని కూడా అనిపిస్తుంది అని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అయితే తన కొడుకుల పక్కన నటించిన హీరోయిన్ల దగ్గర కాస్త తనకి తానే ఒక గీత గీసుకుని ఉంటాను అని చెప్పడం అందరినీ మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఏదేమైనా మోహన్ బాబు ఇటువంటి మాటలు మాట్లాడి ఉండకూడదు అని అందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

మరి ఇక నైనా సరే మోహన్ బాబు తన స్పీచ్ లలో ఇటువంటి కామెంట్స్ ఉండకుండా చూసుకుంటే మంచిది అనే సూచన అందరి వైపు నుండి వస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS