వి మిస్‌ యు అంటోన్న అఖిల్‌, నిధి.!

మరిన్ని వార్తలు

అక్కినేని అఖిల్‌, నిధి అగర్వాల్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'మిస్టర్‌ మజ్ను'. టైటిల్‌కి యాప్ట్‌ అయ్యేలా ఈ సినిమా నుండి ఫస్ట్‌ ఆడియో సింగిల్‌ని రిలీజ్‌ చేశారు. 'నువ్వెటో నేనెటో మనసెటో..' అని సాగే ఈ లిరికల్‌ సాంగ్‌లో హీరో, హీరోయిన్లు ఇద్దరూ ఒకరినొకరు మిస్‌ అవుతున్నట్లుగా, బాధగా కనిపించారు. వీడియోలో అక్కడక్కడా చూపించిన లొకేషన్స్‌ చాలా గ్రాండియర్‌ లుక్‌లో కనిపిస్తున్నాయి. నిధి అగర్వాల్‌ క్యూట్‌గా, అందంగా కనిపిస్తోంది.

 

కానీ ఆమె ముఖంలో నవ్వు లేదు. అలాగే అఖిల్‌ కూడా లైట్‌గా గెడ్డంతోనూ అక్కడక్కడా నీట్‌ షేవ్‌తో కనిపిస్తున్నాడు. ప్రేమ విరహాన్ని తట్టుకోలేని మజ్నులా వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఇదీ ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ కథ. తమన్‌ అందించిన మ్యూజిక్‌లో ఈ సాంగ్‌ బాగుంది. అయితే ఫస్ట్‌ ఇంపాక్ట్‌ ఇంత డల్‌గా ఉందే అని నెటిజన్లు కొంచెం నిట్టూరుస్తున్నారు.

 

అయితే తర్వాత వచ్చే సాంగ్స్‌ మాత్రం ఫుల్‌ జోష్‌తో ఉండబోతున్నాయనీ తెలుస్తోంది. జనవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. బి.వి.యస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. గాఢమైన లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న 'మిస్టర్‌ మజ్ను' అయినా అఖిల్‌ని గట్టెక్కిస్తుందో లేదో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS