నయన్ తో మైత్రీ

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీస్ ఒకటి. తెలుగు సినిమాలు ఎక్కువ ఈ బ్యానర్లో వచ్చినవే. ప్రజంట్ మైత్రీ మూవీస్ కొంచెం స్లో అయ్యింది కారణం 'పుష్ప 2' మూవీ ఈ బ్యానర్ లోనే వస్తోంది. ఇది కంప్లీట్ అయిన తరవాతే, మిగతా ప్రాజెక్టులు చేద్దామని ఆలోచనతో వేరే ఏవి ఒప్పుకోలేదు. 'పుష్ప 2'  తరువాత ఈ బ్యానర్ నయనతారతో లేడీ ఓరియంటెడ్ మూవీ చేసే ప్లాన్ ఉందట. పాన్ ఇండియా లెవెల్లో రూపొందించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు, ఇప్పటికే నయన తారని సంప్రదించినట్టు, ఆమె కూడా సిద్ధంగా ఉందని టాక్.
 

ఈ ప్రాజెక్ట్  కోసం నయనతారకు హెవీ రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదే నయన్ కెరియర్లో హైయ్యెస్ట్ పారితోషికమని వినిపిస్తోంది. నయన్ క్రేజే వేరు, తాను ఒప్పుకున్న పాత్రకి వంద శాతం న్యాయం చేకూరుస్తుంది. కేవలం నయన్ కోసమే స్పెషల్ గా కథ రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఈ మూవీకి నయనతార అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భారీగా ఆఫర్ చేసారంట మైత్రీ వారు.


కథ ఏ జోనర్ కి సంబంధించినది? దర్శకుడు ఎవరు? మిగతా నటీ నటులు, ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది? అనే ప్రశ్నలకు 'పుష్ప 2' రిలీజ్ తరవాత క్లారిటీ వస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS