చైతూ, అఖిల్‌ ఇద్దరిలో 'మన్మధుడు 2' ఎవరు.?

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ మన్మధుడు అంటే ఠక్కున గుర్తొచ్చేది అక్కినేని నాగార్జున. వయసు మీద పడినా, ఆ బిరుదు మాత్రం పోవట్లేదు ఆయనకు. ప్రస్తుతం వయసుకు తగ్గ సినిమాలు చేస్తూ పోతున్నా కానీ మన్మధుడు అన్న బిరుదు ఆయనకే సొంతం. అయితే ఇప్పుడు ఆయన కొడుకులొచ్చారు. 

నాగార్జున రేంజ్‌లో హిట్స్‌ కొట్టకపోయినా, చైతూ ఏదో తంటాలు పడుతున్నాడు. కానీ అఖిల్‌కి ఇంకా సరైన ప్లాట్‌ఫామ్‌ సెట్‌ కాలేదు. తొలి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. రెండవ సినిమా 'హలో' ఫర్వాలేదనిపించాడు. చైతూ గురించి తెలిసిందే. మాస్‌ ఇమేజ్‌ కోసం ట్రై చేసి, తన ఒంటికి పడదని తెలిసి లవ్‌ స్టోరీస్‌ అయిన 'ప్రేమమ్‌', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలతో మంచి హిట్స్‌ అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 

అసలింతకీ ఇప్పుడీ ఫ్యామిలీ మూవీస్‌ లిస్ట్‌ ఎందుకు తీశామనుకుటున్నారా? వెరీ లేటెస్టుగా నాగార్జున 'మన్మధుడు 2' టైటిల్‌ని రిజిస్టర్‌ చేయడమే ఈ వెలికితీతకు కారణం. నాగార్జున హీరోగా 2002లో వచ్చిన 'మన్మధుడు' చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అన్న సంగతి ఎవరినడిగినా ఇట్టే చెప్పేస్తారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్‌ రాబోతోందా? అంటే అవునంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అయితే ఈ సీక్వెల్‌లో నటించే అక్కినేని హీరో ఎవరు? అంటే నాగార్జునను ఇప్పటికీ ఆ పాత్రలో ఎక్స్‌పెక్ట్‌ చేయగలం కానీ, ఆయనే అందుకు ఒప్పుకోవడం లేదు. మరి ఆయన కొడుకుల్లో చైతూ, అఖిల్‌ ఎవరో ఒకరి కోసం ఈ టైటిల్‌ రిజిస్టర్‌ చేశారా? అంటే అది కూడా కావచ్చు. 

ప్రస్తుతం చైతూ 'సవ్యసాచి' సినిమాతో రాబోతున్నాడు. అఖిల్‌ 'మిస్టర్‌ మజ్ను' (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమాలో నటిస్తున్నాడు. మరి వీరిద్దరిలో మన్మధుడు 2 ఎవరో.? చూడాలిక మరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS