జనసేనకు మెగా బ్రదర్‌ విరాళం.!

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీకి మెగా బ్రదర్‌ నాగబాబు 25 లక్షల విరాళం ప్రకటించారు. నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. బిజీగా ఉండడం వల్ల జనసేన పార్టీకి ఇంతవరకూ మేము చేసింది ఏమీ లేదు. కానీ ఇకపై చేయాల్సింది చాలా ఉంది. చాలా చాలా చేయాల్సి ఉంది.. అంటూ నాగబాబు పేర్కొన్నారు.

 

అన్నయ్య నాగబాబుకు, అబ్బాయ్‌ వరుణ్‌తేజకు పవన్‌ కళ్యాణ్‌ సోషల్‌ మీడియా వేదికగా థాంక్స్‌ చెప్పారు. మెగా ఫ్యామిలీలో చీలికలున్నాయంటూ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడే వాటిని ఖండిస్తూ, మెగా ఫ్యామిలీ తమ ఐక్యతను చాటుకుంటూనే ఉంటారు. తాజాగా మెగా బ్రదర్‌ నాగబాబు వ్యాఖ్యలతో మరోసారి అది నిరూపితమైంది.

 

ఇటీవల పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ విరాళాల నిమిత్తం అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి అభిమానులు పవన్‌కు సాదరసత్కారాలు అందించారు. పార్టీకి తమ వంతు సాయం అందిస్తామని అండగా ఉంటామని పవన్‌కి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే, గాజు గ్లాసును జనసేన పార్టీ సింబల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS