కింగ్ అక్కినేని నాగార్జున ఈమధ్యకాలంలో సినిమాలు అంగీకరించే విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆర్జీవీతో ఆఫీసర్ సినిమా పూర్తి చేయగానే నానితో కలిసి ఒక మల్టీ స్టారర్ చిత్రం లో నటించేస్తున్నాడు. ఇక ఇది సెట్స్ పైన ఉండగానే మరో చిత్రానికి పచ్చ జెండా ఊపేసాడు నాగ్.
వివరాల్లోకి వెళితే, తమిళ హీరో దర్శకుడు అయిన ధనుష్ తనకి పిల్లనిచ్చిన మామ సూపర్ స్టార్ రజినీకాంత్ ని దృష్టిలో పెట్టుకుని ఒక కథ రాసుకున్నాడట, అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన ఈ తరుణంలో ఆ కథ పక్కన పెట్టేశాడు.
అయితే ఆ కథ మరొక హీరోకి సరిగ్గా సరిపోతుంది అని ఆలోచించి అదే కథని హీరో నాగార్జునకి వినిపించాడట. ధనుష్ చెప్పిన కథ నాగార్జున కి నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. ఇక ఈ చిత్రం ఏకకాలంలో తెలుగు-తమిళ బాషలలో తెరకేక్కే అవకాశం ఉందట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది అని సమాచారం.
అన్ని అనుకున్నట్టుగా జరిగితే, ధనుష్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా కనిపిస్తాడు.