'విరాటపర్వం'లో వివాదాల నటుడు ఒప్పేనా?

మరిన్ని వార్తలు

రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతోన్న 'విరాటపర్వం' సినిమాలో నానాపటేకర్‌ని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్లు తాజా సమాచారమ్‌. ఏంటీ? నానాపటేకరా ఈ మధ్య 'మీ టూ' వివాదం కారణంగా రచ్చయిన నటుడే కదా అనుకుంటున్నారా? అవునండీ అక్షరాలా ఆయనే.

 

'మీ టూ' మూమెంట్‌తో బాలీవుడ్‌లో ఆయన్ని బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే సైన్‌ చేసిన సినిమాల నుండి కూడా ఆయన్ని నిర్ధాక్షిణ్యంగా తొలిగించి వేశారు ఈ మీ టూ హీట్‌తో. అలాంటిది ఇప్పుడు టాలీవుడ్‌కి ఆయన్ని ఎలా తీసుకొస్తారు? అంటూ కొందరు వాదిస్తున్నారు. ఈ మీటూ ప్రకంపనలు కేవలం బాలీవుడ్‌కే కాదు, మిగిలిన సినీ పరిశ్రమలతో సహా, రాజకీయం వంటి వివిధ రంగాలకు కూడా ఎగబాకిన సంగతి తెలిసిందే. అసలే కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో టాలీవుడ్‌లో ఇంచుమించు మీటూ హీట్‌ నివురు గప్పిన నిప్పులా అలా అణగదొక్కబడి ఉంది.

 

మరి ఈ తాజా న్యూస్‌తో మళ్లీ ఆ మూమెంట్‌ రైజ్‌అప్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ పరిస్థితిని 'విరాటపర్వం' టీమ్‌ ఊహించలేదో ఏమో. అయితే, విరాటపర్వంలో నానాపటేకర్‌ పాత్ర విషయమై ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. ఇకపోతే, నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'విరాటపర్వం' ప్రత్యేకమైన కథా, కథనాలతో తెరకెక్కుతోన్న చిత్రం. రానా, సాయి పల్లవి ఈ సినిమాలో నక్సలైట్ల పాత్రలు పోషిస్తున్నారనీ సమాచారమ్‌. మరో ఇంపార్టెంట్‌ రోల్స్‌లో సీనియర్‌ నటి టబు, ప్రియమణి నటించనున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS