పట్టాలెక్కిన నాని 'జెర్సీ'

మరిన్ని వార్తలు

ఎట్టకేలకు నాని హీరోగా 'జెర్సీ' సినిమా పట్టాలెక్కింది. గతంలో కబడ్డీ నేపథ్యంలో 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాలో నటించిన నాని, మళ్ళీ ఈ సినిమాతో క్రీడా నేపథ్యమున్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా ఈ చిత్రం నిర్మితం కానుంది. నాని ఈ సినిమాలో డబుల్‌ రోల్‌లో కన్పించబోతున్నాడట. నాని గతంలో డబుల్‌ రోల్‌ చేసినా, అందుకు భిన్నంగా ఈసారి తండ్రీ కొడుకులుగా ఈ సినిమాలో నాని నటిస్తున్నాడని తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఈ సినిమా ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 

సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ ఈ సినిమాలో మరో కీలక భూమిక పోషిసుత్నఆ్నరు. అందాల భామ శ్రద్ధా శ్రీనాథ్‌ తొలిసారిగా నాని సరసన నటిస్తోంది. 'జెర్సీ' సినిమాకి సంబంధించి టైటిల్‌ లోగో కొన్నాళ్ళ క్రితం విడుదల చేసిన సంగతి తెల్సిందే. నాని గత చిత్రం 'దేవదాస్‌' చెప్పుకోదగ్గ విజయాన్నే అందుకుంది. దసరా సీజన్‌లో 'దేవదాస్‌'కి మళ్ళీ వసూళ్ళ కళ కన్పిస్తోందని ట్రేడ్‌ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. 

ఈ సినిమాలో నానితోపాటు నాగార్జున కూడా నటించడం, నాని - నాగ్‌ ఈ సినిమాలో పోటీ పడి పెర్పామెన్స్‌తో అదరగొట్టేయడం తెల్సిన విషయాలే. 'జెర్సీ' విషయానికొస్తే, ఈ సినిమాలో ఓ ప్రముఖ నటుడు అతిథి పాత్రలో కన్పించబోతున్నాడని సమాచారమ్‌. అలాగే ఓ ప్రముఖ హీరోయిన్‌ కూడా గెస్ట్‌ రోల్‌ చేయబోతోందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS