ఏవండోయ్‌ నానీ గారూ ఆడోళ్లంతా అంతేనా?

మరిన్ని వార్తలు

'ఎంసీఏ' తర్వాత నాని నటిస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొన్నీ మధ్యన విడుదలైన ఆడియో సింగిల్స్‌లోనే నాని రఫ్‌ అండ్‌ క్లాస్‌ లుక్స్‌ని పరిచయం చేసేసింది చిత్ర యూనిట్‌. నాని ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఓ పాత్రలో పల్లెటూరి యువకుడిగానూ, ఇంకో పాత్రలో హైఫై కుర్రోడిగానూ నాని కనిపిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. టీజర్‌లో లవ్‌, రొమాన్స్‌, కామెడీ అన్ని రకాల రసాలు సమపాళ్లలో మేళవించి వదిలారు. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయినంటూ 'ఎంసీఏ'లో నాని చెప్పిన ఫిలాసఫీని ఇంకా మర్చిపోక ముందే మళ్లీ కొత్త ఫిలాసఫీతో వచ్చేస్తున్నాడు. ఈ సారి నాని ఏం చెబుతున్నాడంటే, 'ఆడోళ్లంతా భలే కఠినాత్ములు..' అంటున్నాడు. అలాగే నూడిల్స్‌ చేయడానికి, అమ్మాయిల్ని పడేయడానికి ఒకే టైం పడుతుందట..' 'రామయణం అంతా విని ధర్మరాజు ఎవరని అడిగిందట నీ లాంటి సోంబేరి మొహంది..' ఇలాంటి డైలాగులున్నాయి ఈ సినిమాలో. అదీ సంగతి. 

టీజర్‌లోనే సింపుల్‌గా చెప్పాల్సిన చాలా విషయాలు బ్రీఫ్‌గా చెప్పేశారు. టీజర్‌ చూశాక ఎప్పటిలానే సినిమాపై అంచనాలు పెరిగాయి. నాని సరసన ఇద్దరు భామలు నటిస్తున్నారు ఈ సినిమాలో. ఒకరు అనుపమా పరమేశ్వరనే కాగా, మరొకరు రుక్సార్‌ అమీర్‌. మొత్తానికి నాని 'కృష్ణార్జున యుద్ధం'తో కూడా హిట్‌ కొడతాడనే అనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్టు మీద హిట్టు కొడ్తోన్న నాని నుంచి వస్తోన్న ఈ సినిమా కూడా హిట్టే అవుతుందని ఆడియన్స్‌ ఎప్పుడో ఫిక్స్‌ అయిపోయారు. హిట్టు పక్కా, అది ఏ రేంజ్‌ హిట్‌ అన్నదే సస్పెన్స్‌!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS