తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్ ల ట్రెండ్ ఈ మధ్యనే ఉదృతమైన నేపధ్యంలో ఒక సంచలన కాంబో ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది.
వివరాల్లోకి వెళితే, దర్శకుడు హరీష్ శంకర్ తాజా చిత్రం ‘దాగుడుమూతలు’ని ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇద్దరు హీరోలకి ఈ చిత్రంలో నటించే అవకాశం ఉండడంతో- నాని & శర్వానంద్ లని ఎంపిక చేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల చేతినిండా సినిమాలు ఉండడంతో త్వరలోనే ఈ దాగుడుమూతలు చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ లొకేషన్స్ ని కూడా ఎంపిక చేయడం పూర్తిచేశాడు.