బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ' రామాయణం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా ఓం రౌత్ చిత్రించిన ఆదిపురుష్ డిజాస్టర్ కావటంతో నితీష్ తివారి రామాయణం పై చాలా మంది ఆశలు పెట్టు కుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీలో కొన్ని పాత్రలు రివీల్ చేశారు. క్రేజీ కాంబినేషన్స్ తో ఈ మూవీ హైప్ రోజు రోజుకి పెరుగుతోంది. ఈ మూవీ లో శ్రీరాముడిగా హీరో రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ ఇప్పటికే ఫైనలయ్యారు.
మిగతా పాత్రలు ఇంకా రివీల్ కాలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రామాణయణంలో కీలకమైన శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడి పాత్రకి టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకొనున్నారని టాక్. ఇందుకోసం మూవీ టీమ్ పోలిశెట్టి తో చర్చలు జరుపుతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. నవీన్ మంచి యాక్టర్, సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. హిందీలో కూడా ఛిచ్చోరె మూవీలో యాక్ట్ చేసాడు. ఈ రకంగా అన్ని ప్రాంతాలవారికి తెలిసిన నటుడు అయితే బాగుంటుందని, ఈ పాత్రకు నవీన్ అయితే సూటవుతారని దర్శకుడు నితేశ్ తివారీ భావిస్తున్నారని, ఈ క్రమం లోనే లుక్ టెస్ట్ చేస్తున్నారని, ఓకే అయ్యాక అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తారని తెలుస్తోంది.
నవీన్ పోలిశెట్టి కూడా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. నితీష్ తివారి తో ఇప్పటికే వర్క్ చేసి ఉన్న నవీన్ రెండో సారి కూడా అతని మూవీ తోనే బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రామాయణం చిత్రంలో హనుమంతుడి పాత్రను సన్నీ డియోల్, దశరథుడి పాత్ర అమితాబ్ బచ్చన్. శూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారని టాక్. నటీనటులందరినీ మరో రెండు వారాల్లో ఫైనల్ చేయనున్నారని సమాచారం. మార్చిలో ఈ మూవీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. మూడు భాగాలుగా ‘రామాయాణం’ తీసుకురావాలని నితేశ్ భావిస్తున్నారట.