'జీరోసైజ్' ఫిగర్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హీరోయిన్ నీతూ చంద్ర. ఎవరీ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా.? మీకు పరిచయమేలెండి. సుమంత్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'గోదావరి' చిత్రంలో బావ బావ.. అంటూ సుమంత్ వెనకాల తిరిగే మరదలు పిల్ల గుర్తుంది కదా.. ఆ ముద్దుగుమ్మే ఈ నీతూ చంద్ర. తెలుగుతో పాటు, హిందీ, కన్నడ, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ 'విష్ణు', 'సత్యమేవ జయతే' తదితర చిత్రాల్లో నటించింది కానీ, పెద్దగా రిజిస్టర్ కాలేదు. 'గోదావరి' సినిమా కొద్దో గొప్పో పేరు తెచ్చిపెట్టిందంతే. ఈ సినిమాలో శేఖర్ కమ్ముల ఈ ముద్దుగుమ్మని పద్ధతిగా చూపించాడు కానీ, పాపలో హాట్ యాంగిల్స్ పుష్కలంగా ఉన్నాయండోయ్.
అలాంటి కొన్ని యాంగిల్స్లోంచి తాజాగా తీసిన ఓ జస్ట్ శాంపిల్ హాట్ యాంగిల్ ఇది. పింక్ హాట్ అండ్ స్సైపీ కాస్ట్యూమ్ ధరించి ఏంటో.. సీరియస్గా ఫోటోకి పోజిచ్చేసింది. ఏమైందో ఏమో కానీ.. ఇంత సీరియస్గా ఉన్నా హాట్ అప్పీల్ మిస్ కాలేదు చూశారా.? అసలుందో లేదో తెలీని, టార్చ్లైట్ వేసి వెతికినా దొరకనంత పర్ఫెక్ట్ షేప్లో ఉన్న ఆ సుతారమైన నడుముపై రెండు చేతులూ ఆనించి స్ట్రెయిట్ పోజిచ్చిన నీతూచంద్ర ఫోటోని మెచ్చిన కళాపోషకులు ఓ రేంజ్లో లైకులు కొట్టేస్తున్నారు. మరి మీరు కూడా ఓ లైకో, లేక లుక్కో వేసుకోండి బాస్.