అక్కినేని కాంపౌండ్‌కి 'నిధి' కలిసిరాలేదు. 'పూజ' ఫలిస్తుందా.?

By Inkmantra - October 23, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని కాంపౌండ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సినిమాల్లో నటించింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. 'సవ్యసాచి' సినిమాతో అన్నయ్య నాగ చైతన్యతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసింది. ఆ వెంటనే, తమ్ముడు అఖిల్‌తోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. అయితే, ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన సినిమాలే. దాంతో అక్కినేని కాంపౌండ్‌కి నిధి కలిసి రాలేదు. ఇక ఇప్పుడు పూజ కలిసొస్తుందా.? అదేనండీ 'పూజా హెగ్దే'. అఖిల్‌ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. అఖిల్‌ భవిష్యత్తు ఇప్పుడు పూజతోనే ముడిపడి ఉంది. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ అండ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా ప్రస్తుతం పూజా టైం నడుస్తోంది. పూజా ఎంట్రీతో అఖిల్‌ సినిమాపై అంచనాలు పెరిగాయి. సో పూజా హెగ్దే పుణ్యమా అని అఖిల్‌కి ఈ సారైనా హిట్‌ దక్కుతుందని అక్కినేని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. నిజానికి ఎప్పుడో పూజా హెగ్దే అక్కినేని కాంపౌండ్‌ని టచ్‌ చేసింది.

 

నాగచైతన్యతో గతంలో పూజా హెగ్దే 'ఒక లైలా కోసం' సినిమాలో నటించింది. అయితే, ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. అప్పట్లో పూజా హెగ్దేకి అంతగా క్రేజ్‌ లేని సమయమది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. పూజా ఫుల్‌ జోష్‌లో ఉంది. సో ఈ సారి అక్కినేని కాంపౌండ్‌కి హిట్‌ పక్కా అంటున్నారు. చూడాలి మరి అఖిల్‌ 'పూజ' ఫలిస్తుందో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS