'నిశ్శ‌బ్దం'గా ఓటీటీలోకి వెళ్లిపోతోందా?

మరిన్ని వార్తలు

పెద్దా, చిన్నా అనే తేడాలేకుండా సినిమాల‌న్నీ ఇప్పుడు ఓటీటీ వైపు ఆశ గా చూస్తున్నాయి. మే 3న లాక్ డౌన్ ఎత్తేస్తే ఫ‌ర్వాలేదు. కానీ ఆ త‌ర‌వాత కూడా కొన‌సాగితే మాత్రం ఓ టీ టీ మిన‌హా సినిమాల‌కు మ‌రో మార్గం లేక‌పోవొచ్చు. ఇటీవ‌లే `అమృత‌రామ‌మ్‌` అనే చిన్న సినిమా ఓటీటీలో విడుద‌లైంది. ఆ సినిమా ఎలా ఉన్నా... ఓటీటీలో చూస్తున్న‌వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. అదే.. కాస్త స్టార్ కాస్ట్ ఉన్న సినిమా అయితే.. ఆ రేంజు మ‌రోలా ఉంటుంది. దాన్ని గ‌మ‌నించిన ఓటీటీ సంస్థ‌లు - ఇప్పుడు పెద్ద సినిమాల్ని లాగ‌డానికి భారీ ఎత్తున ప్ర‌య‌త్నిస్తున్నాయి. వాళ్ల దృష్టి అనుష్క `నిశ్శ‌బ్దం`పై ప‌డింది.

 

ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమా ఇది. కానీ.. లాక్ డౌన్ వ‌ల్ల వీలు ప‌డ‌లేదు. ఈ సినిమా కొనాల‌ని అమేజాన్‌, హాట్ స్టార్ లాంటి సంస్థ‌లు ప్ర‌య‌త్నించాయి. అయితే ఓటీటీకి అమ్మ‌డానికి నిర్మాత‌లు ఒప్పుకోలేదు. ఇప్పుడు లాక్ పెరిగితే మాత్రం ఈ సినిమాని ఓటీటీకి అమ్ముకోక త‌ప్ప‌దు. అందుకే ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా కాస్త మెత్త‌బ‌డిన‌ట్టు తెలుస్తోంది.

 

ఓటీటీలో సినిమాని ప్ర‌ద‌ర్శించుకోవ‌డానికి తామేమీ వ్య‌తిరేకం కాద‌ని. అయితే లాక్ డౌన్ త‌ర‌వాత ప‌రిస్థితుల్ని అంచ‌నా వేసి, ఓ నిర్ణ‌యానికి వ‌స్తామ‌ని, త‌మ సినిమా కొన‌డానికి ఓటీటీ సంస్థ‌లు ఆస‌క్తి చూపించాయ‌ని, అయితే ఇంకా ఓ నిర్ణ‌యం తీసుకోలేద‌ని ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్ తేల్చేశారు. అనుష్క కూడా ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు స‌పోర్ట్ చేస్తోంద‌ని, సినిమాలోనే రిలీజ్ చేయాల‌ని అనుష్క ఏమీ ప‌ట్టుప‌డ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు హేమంత్‌. సో.. నిశ్శ‌బ‌ద్దం... సెలైంట్ గా ఓటీటీలో వ‌చ్చేస్తోంద‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS