ఈ జయలలిత నిత్యామీనన్‌ కాదట.!

మరిన్ని వార్తలు

తమిళనాడు ప్రజలు అమ్మ అని ప్రేమగా పిలుచుకునే మహిళ, దివంగత మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించేందుకు కోలీవుడ్‌లో ఒకరు కాదు, ముగ్గురు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ నిత్యామీనన్‌ ముఖ్య పాత్రలో ఓ బయోపిక్‌ సెట్స్‌ మీదుంది. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌కి సంబంధించి, ఇటీవలే జయలలిత పాత్రలో నిత్యామీనన్‌ ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు. మరోవైపు భారతీరాజా దర్శకత్వంలో ఇంకో బయోపిక్‌కి స్క్రిప్టు పనులు వేగంగా జరుగుతున్నాయి.

 

ముచ్చటగా మూడో బయోపిక్‌ని ఏ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్‌లో జయలలిత పాత్ర కోసం విద్యాబాలన్‌ని ఎంచుకున్నారట. జయలలిత జీవిత చరిత్రలో అతి ముఖ్యమైన వ్యక్తి ఎమ్‌జీఆర్‌. ఆ పాత్ర కోసం అరవింద్‌స్వామిని తీసుకున్నారట. ఈ కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫిబ్రవరి 24న అధికారిక ప్రకటన రానుందని కోలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌.

 

ఆ రోజు జయలలిత జయంతి కావడంతో అదే మంచి ముహూర్తంగా భావించారట. అంతేకాదు, ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని కూడా ముందుగానే ప్లాన్‌ చేశారు. 2020 ఫిబ్రవరి 24న ఈ బయోపిక్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. అత్యంత భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS