మలయాళ కుట్టి నిత్యా మీనన్ని మంచి హీరోయిన్ అనడం కన్నా, మంచి నటి అనడం అతిశయోక్తి కాదేమో. కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడం కన్నా, టాలెంట్ ఉన్న విలక్షణ నటి అనిపించుకోవడమే మిన్న అనే ఆటిట్యూడ్తో కెరీర్ని రన్ చేస్తోంది ముద్దుగుమ్మ నిత్యా మీనన్. కళ్లతోనే వేయి హావ భావాలు పలికించగల సత్తా ఉన్న నటి. గత పదేళ్లుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ తదితర సౌత్ భాషల్లో నటిగా సత్తా చాటుతోంది. కథ నచ్చి, తన పాత్ర నచ్చితే చాలు, నిడివితో సంబంధం లేకుండా ఆ సినిమాలో భాగం పంచుకుంటుంది నిత్యా మీనన్.
ఇంత యాక్టింగ్ టాలెంట్ ఉన్నా, ఇంతవరకూ నిత్యా మీనన్ని జాతీయ అవార్డ్ వరించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అయితే, తనకింకా చాలా కెరీర్ ఉందనీ, జాతీయ అవార్డ్ విన్నింగ్ క్యారెక్టర్స్ని ఈ జర్నీలో ఎలాగైనా అందుకుంటానని ధీమా వ్యక్తం చేస్తోంది అందాల నిత్యామీనన్. సౌత్ సినిమాలతో పాటు, ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. 'మిషన్ మంగళ్'లో కీలక పాత్ర పోషించిన నిత్యా మీనన్ నటనకు ఏకంగా ఖిలాడీ అక్షయ్ కుమారే ఫిదా అయిపోయాడు. ఆ సినిమా తర్వాత బాలీవుడ్లో నిత్యాకి మరో ఆఫర్ కూడా వచ్చిందట. అయితే, నిత్యా సంగతి తెలుసు కదా.. పాత్ర నచ్చితేనే ఆ సినిమాలో నటించడానికి ఓకే చేస్తుంది. వచ్చిన ప్రతీ ఆఫర్నీ అంది పుచ్చుకుంటే తను నిత్యా మీనన్ ఎందుకవుతుంది.? బాలీవుడ్లో ఆఫర్ అంటే ఎగబడి డేట్స్ ఇచ్చేసేవాళ్లున్న ఈ రోజుల్లో కోరి వచ్చిన ఆఫర్ని కాదనుకుందంటే, నిత్యా మీనన్ మామూలుది కాదండోయ్. అందుకే నిత్యా ఈజ్ సింగిల్ పీస్, హైబ్రీడ్ పిల్ల అంతే.