సుప్రీమ్‌ హీరోతో ‘మెంటల్‌’ భామ ఇంకోస్సారి.!

మరిన్ని వార్తలు

‘మెంటల్‌ మదిలో’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌ సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ పోతోంది. అయితే, ఫస్ట్‌ హీరోయిన్‌ ఛాన్స్లు తక్కువగానే వస్తున్నాయి ఈ ముద్దుగుమ్మకి. కానీ, తన పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉండేలా చూసుకుంటోంది. రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో..’ సినిమాలో నటించిన నివేదా పేతురాజ్‌, తాజాగా మరో మెగా ఆఫర్‌ని దక్కించుకుందట. ‘చిత్రలహరి’ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించినా, కథకి కీలకమైన ఆమె పాత్రను డైరెక్టర్‌ చాలా బాగా డీల్‌ చేశాడు. ఆ పాత్రలో తనవంతు నటన కనబరిచి, మంచి మార్కులేయించుకుంది నివేదా పేతురాజ్‌.

 

ఇక ఇప్పుడు సుప్రీమ్‌ హీరోకి సోలో హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ‘సోలో బతుకే సో బెటర్‌’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ సినిమా తర్వాత సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ‘ప్రస్థానం’ ఫేమ్‌ దేవకట్టాతో ఓ సీరియస్‌ యాక్షన్‌ డ్రామాకి ఎప్పుడో కమిట్‌ అయ్యాడు. ఆ సినిమాలో నివేదా పేతురాజ్‌, తేజుతో జత కట్టనుందట. ప్రస్తుతం రామ్‌ హీరోగా రూపొందుతోన్న ‘రెడ్‌’ సినిమాలో నివేదా పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS