'జెంటిల్మెన్' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నివేదా థామస్. ఇటీవల 'దర్బార్' సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్కి కూతురిగా నటించి ఎప్పటిలాగే నటనలో మార్కులు కొట్టేసింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ నయనతార కన్నా, నివేదా థామస్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందుకే ఆ పాత్ర కోసం ఏరి కోరి ఈ టాలెంటెడ్ బ్యూటీని ఎంచుకోవడం జరిగింది. ఇకపోతే, తాజాగా మరో ఛాన్స్ కొట్టేసిందీ మలయాళ బ్యూటీ. తెలుగులో చిన్న సినిమాగా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా 'బ్రోచేవారెవరురా'. ఈ సినిమాని ఇప్పుడు తమిళంలో తెరకెక్కిస్తున్నారట.
క్రైమ్ థ్రిల్లర్ అండ్ యూత్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో మిత్ర పాత్ర పోషించిన నివేదా థామస్నే తమిళంలోనూ హీరోయిన్గా తీసుకున్నారట. ఆల్రెడీ 'దర్బార్'తో తమిళంలో విపరీతమైన అభిమానం సంపాదించిన నివేదా ఇప్పుడీ తాజా సినిమాతో నెక్స్ట్ లెవల్కి చేరనుందంటున్నారు. మరోవైపు తెలుగులో కూడా నివేదా థామస్కి అవకాశాలు పోటెత్తుతున్నాయట. ఇప్పటికే 'వి' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది నివేదా. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్తో 'జై లవకుశ' సినిమాలో నటించిన నివేదాకి మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కిందంటూ లేటెస్ట్గా ఓ అప్డేట్ ఉంది. అయితే, ఆ స్టార్ హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. చూస్తుంటే, నివేదా థామస్ తన టాలెంట్తో ముందు ముందు చాలా బిజీ అయిపోయేలానే కనిపిస్తోంది.