పోటీ తట్టుకోవాలంటే తమ్ముడు రావల్సిందే.!

మరిన్ని వార్తలు

ఈ ఏడాది సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద తలపడుతున్న సంగతి తెలిసిందే. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు..'తో పాటు, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ 'అల వైకుంఠపురములో' సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద బడా పోరుకు సిద్దమయ్యారు. ఒక్కరోజు తేడాతో వీరిద్దరూ బరిలో దిగుతుంటే, నేనేం తక్కువ కాదంటూ నందమూరి నటసింహం కళ్యాణ్‌రామ్‌ కూడా కాలు దువ్వుతున్నాడు.

 

జనవరి 15న 'ఎంత మంచివాడవురా' సినిమాతో కళ్యాణ్‌ రామ్‌ వస్తున్నాడు. డీసెంట్‌ మూవీస్‌ దర్శకుడు సతీష్‌ వేగేశ్న ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఓ పక్క 'సరిలేరు..' ఇంకో పక్క 'అల వైకుంఠపురములో..' టీమ్స్‌ నువ్వా నేనా.. అనే రేంజ్‌లో పబ్లిసిటీ చేస్తుంటే, మరి తనవంతుగా కళ్యాణ్‌రామ్‌ కూడా ఎంతో కొంత పబ్లిసిటీ చేయాలి కదా. తన వంతుగా అంటే, తన తమ్ముడు ఎన్టీఆర్‌ని బరిలోకి దించాలనుకుంటున్నాడు కళ్యాణ్‌రామ్‌.

 

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని వెరీ గ్రాండ్‌గా ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. ఆ ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ని ఛీఫ్‌ గెస్ట్‌గా ఆహ్వానించి, మహేష్‌కీ, అల్లు అర్జున్‌కీ తన సినిమాతో గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నాడట. మరి ఈ నందమూరి అన్నయ్య పిలిస్తే యంగ్‌ టైగర్‌ తమ్ముడు రాకుండా ఉంటాడా.? అసలే తండ్రి హరికృష్ణ హఠాన్మరణం తర్వాత ఈ అన్నదమ్ములిద్దరి మధ్యా బంధం బాగా బలపడింది. ఈ తరుణంలో తన ప్రియమైన అన్నయ్య సినిమా ప్రమోషన్‌ కోసం తమ్ముడు రాకుండా ఉంటాడా.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS