మనోజ్‌ 'ఒక్కడు మిగిలాడు' అదుర్స్‌!

మరిన్ని వార్తలు

ఆ మధ్య కొంచెం సన్నబడ్డ మంచు మనోజ్‌ ఇప్పుడెందుకు లావెక్కాడు? అనే ప్రశ్నకి సమాధానంగా 'ఒక్కడు మిగిలాడు' సినిమా గురించి చెప్పాడాయన. ఆ 'ఒక్కడు మిగిలాడు' సినిమా దేని మీదనో తెలుసా? ఎల్‌టిటిఈ మీద. లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈళం (ఎల్‌టిటిఇ)ని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో వ్యక్తి అయిన ప్రభాకరన్‌ పాత్రలో మంచు మనోజ్‌ నటిస్తున్నట్లున్నాడు. ఈ సినిమా తాజా లుక్‌ విడుదలైంది. 1990 ఎల్‌టిటిఇ చీఫ్‌ అని పేర్కొంటూ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. కెరీర్‌లో సక్సెస్‌ ఫెయిల్యూర్‌ ఎలా ఉన్నప్పటికీ విలక్షణమైన చిత్రాలు ఎంచుకోవడంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు మంచు మనోజ్‌. ఈ మధ్యనే 'గుంటూరోడు' చిత్రంలో నటించిన మనోజ్‌, ఈసారి ఎల్‌టిటిఇ చీఫ్‌ పాత్రలో 'ఒక్కడు మిగిలాడు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం బాగా లావెక్కాడు. లావెక్కితే ఎక్కాడుగానీ తన పాత్రకు పూర్తి న్యాయం చేసేలా ఉన్నాడు. ఈ తరం జనాలకి ప్రభాకరన్‌ గురించి తెలియదు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళుల హక్కుల కోసం ఉద్యమించారు ప్రభాకరన్‌. ఏదేమైనా ఈ చారిత్రక చిత్రం మనోజ్‌ కెరీర్‌లో ప్రత్యేకమైనదిగా భావించవలసి ఉంటుందనడం నిస్సందేహం. కమర్షియల్‌ చిత్రాలు ఎంచుకుని స్టార్‌డమ్‌ సొంతం చేసుకోవాలనుకోకుండా, విలక్షణ చిత్రాలను ఎంచుకుంటున్న మనోజ్‌ని అభినందించితీరాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS