బంపర్‌ ఛాన్స్‌ కొట్టేసిన 'గీత గోవిందం' డైరెక్టర్‌

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ, రష్మికా జంటగా తెరకెక్కిన 'గీత గోవిందం' అనూహ్యంగా ఘన విజయం సాధించింది. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. విజయ్‌ దేవరకొండ, రష్మికా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది ఈ సినిమా. 

ఇకపోతే ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్‌ గతంలో 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అది కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనరే. అలాగే 'గీత గోవిందం' చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించాడు. అల్లు అరవింద్‌ ఈ చిత్రానికి సమర్పకుడు కావడంతో, పరశురామ్‌ పంట పండింది. మెగా కాంపౌండ్‌తో బెస్ట్‌ కనెక్షన్‌ కుదిరింది. ఈ సినిమా విజయంతో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మరో సినిమాకి రెడీగా ఉండమని అల్లు అరవింద్‌, పరశురామ్‌కి హామీ ఇచ్చారట. 

దాంతో పరశురామ్‌కి ఓ పెద్ద బాధ్యత మీద పడినట్లే అయ్యింది. అంతేకాదు, ఆయనకు ఇదో బంపర్‌ ఛాన్స్‌ కూడా. గతంలో అల్లు శిరీష్‌తో తెరకెక్కించిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం సంగతి వేరే. ఇప్పుడు పరశురామ్‌పై ఉన్న బాధ్యత వేరు. ఎందుకంటే ఇప్పుడు స్టైలిష్‌ స్టార్‌తో పరశురామ్‌ సినిమా ఉండబోతోందట. అయితే ఏమాత్రం తొందరపడకుండా, ఆచి తూచి, అదిరిపోయే స్టోరీ ప్రిపేర్‌ చేయనున్నాడట పరశురామ్‌. అందుకు కొంచెం ఎక్కువే టైం తీసుకోవాల్సి వస్తుందనీ ఆయన అంటున్నారు. 

ఇకపోతే, 'గీత గోవిందం' అందించిన సక్సెస్‌తో విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించాలన్న తన కోరికకు బలం చేకూరిందట. పరశురామ్‌ నుండి రాబోయే తదుపరి చిత్రం ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ కానుందని స్వయంగా ఆయన ద్వారానే సంకేతాలు అందుతున్నాయి మరి.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS