మ‌రీ అంత స‌మ‌ర్థింపు అవ‌స‌ర‌మా ప‌ర‌శురామా?

మరిన్ని వార్తలు

`స‌ర్కారు వారి పాట‌` క‌ల‌క్ష‌న్ల మాట ప‌క్క‌న పెడితే.. ఈ సినిమాలో చాలా లాజిక్ లెస్ సీన్లు క‌నిపిస్తాయి. అస‌లు ఈ క‌థ మ‌హేష్ ఇమేజ్‌కే మ్యాచ్ కాలేద‌ని, కేవ‌లం మ‌హేష్ గ్లామ‌ర్‌, త‌న స్టార్ డ‌మ్ తోనే సినిమా లాక్కొచ్చాడ‌ని విమ‌ర్శ‌కులు పెద‌వి విరిచారు. ఈ సినిమాపై అభిమానులూ అసంతృప్తిగానే ఉన్నారు. ఇందులో కొన్ని సీన్లు కుటుంబ ప్రేక్ష‌కుల‌కు అస్స‌లు న‌చ్చ‌లేదు.

 

ముఖ్యంగా మ‌హేష్ - కీర్తిల ఎపిసోడ్‌. మ‌హేష్ .. కీర్తిపై కాలేసుకొని ప‌డుకోవ‌డం అనే స‌న్నివేశాల్ని ఓ ప్ర‌హ‌స‌నంలా తీర్చిదిద్దాడు ప‌ర‌శురామ్. ఆయా స‌న్నివేశాల‌ కీర్తి సురేష్ పాత్ర‌ని డీగ్రీడ్ చేస్తున్న‌ట్టు సాగాయి. సినిమాలో ఇదే పెద్ద మైన‌స్‌. ఈ విష‌యాన్ని ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే.. ``ఆ స‌న్నివేశాల్లో ఎలాంటి అభ్యంత‌రం నాకు క‌నిపించ‌లేదు. ఓ కొడుకు త‌న తల్లిపై కాలేసుకుని ప‌డుకుంటాడు క‌దా. అలాంటి సంద‌ర్భ‌మే అది..`` అని వెన‌కేసుకొచ్చాడు. ప్ర‌తీ దర్శ‌కుడికీ తాను రాసిన స‌న్నివేశంపై ప్రేమ‌, అభిమానం, వాత్స్య‌ల్యం ఉంటాయి. అంత మాత్ర‌న‌.. అంద‌రూ విమ‌ర్శిస్తున్న స‌న్నివేశాన్ని ప‌ట్టుకొని.. ఓ కొడుకు - అమ్మ‌తో పోల్చ‌డం ఆశ్య‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ``కొంత‌మందికి న‌చ్చ‌లేదు కానీ.. చాలామందికి న‌చ్చింది. మాస్ కోస‌మే అలాంటి సీన్ పెట్టా`` అని చెబితే స‌రిపోయేదాన్నికి.. తల్లీ కొడుకుల పోలిక తెచ్చి పెట్టాడు ప‌ర‌శురామ్. అది కాస్త ఎబ్బెట్టు వ్య‌వ‌హారంలా త‌యారైపోయిందిప్పుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS