వీరమల్లు.. విజయవాడలో

మరిన్ని వార్తలు

రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలకి టైం కేటాయించలేకపోతున్నారు. కానీ ఇప్పటివరకు తాను ఒప్పుకున్న సినిమాల్ని కంప్లీట్ చేసేందుకు కొంత టైం కేటాయిస్తానని నిర్మాతలకి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పడు షూటింగ్స్ కి టైం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే 'హరిహర వీరమల్లు' మూవీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. హరి హర వీరమల్లు మూవీ రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ముందే అనౌన్స్ చేశారు. ఇప్పుడు మొదటి పార్ట్ పూర్తి చేసేందుకు పవన్ డిసైడ్ అయ్యారు.  


ఈ క్రమంలోనే  సెప్టెంబర్ 23 నుంచి విజయవాడలో 'హరి హర వీర మల్లు' కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే టైటిల్ తో త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కొని యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నట్లు టాక్. ఇందుకోసం  హాలీవుడ్ నుంచి ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ 'నిక్ పావెల్' ని రంగంలోకి దింపారు మేకర్స్. నిక్ పావెల్ హాలీవుడ్ లో 'బ్రేవ్‌హార్ట్', 'గ్లాడియేటర్', 'బోర్న్ ఐడెంటిటీ', 'ది లాస్ట్ సమురాయ్', 'రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్' లాంటి హిట్ సినిమాలకి పని చేశారు.  


నిక్ పావెల్ లాంటి అద్భుత యాక్షన్ దర్శకుడి సారధ్యంలో 400 మందితో ఈ యాక్షన్ గట్టాలని తెరకెక్కించ నున్నారు. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూడని విధంగా ఈ మూవీలో వార్ సీన్స్ ఉంటాయని టాక్. మొదట ఈ మూవీకి క్రిష్ దర్శకుడు కాగా ఇప్పుడు జ్యోతి కృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న హరి హర వీర మల్లులో బాబీ డియోల్, అనుపమ ఖేర్ లాంటి హాలీవుడ్ నటులు ఉన్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS