2024 కొత్త ఏడాది లోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా పాత సంవత్సరం లో జరిగిన కొన్నిటిని రివైండ్ చేసుకుంటారు. ఈ క్రంమలోనే 2023 ' X ' వేదిక ద్వారా ఎక్కువమంది పాపులర్ అయిన వాళ్ళు, ఫాలోవర్స్ పెరిగిన వాళ్ళు, టాప్ టెన్ లో ఉన్న వాళ్ళ లిస్ట్ ఒకటి వచ్చింది. X 2023 రీక్యాప్ పేరుతో 'మోస్ట్ టాక్డ్ అబౌట్ ఇండియన్ అకౌంట్స్' పేరుతో నిర్వహించిన సర్వేలో పొలిటీషన్స్, క్రీడా కారులు, సినిమా రంగాలకి చెందిన పలువురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్ మాత్రమే టాప్ టెన్ లో 10 వ స్థానం లో నిలిచారు.
ఈ లిస్ట్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. మోదీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఎక్స్ లో 94 మిలియన్లు ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలో మరే నేతకు ఈ స్థాయిలో ఫాలోవర్లు లేరు. యూట్యూబ్ లో కూడా మోదీదే హవా. సెకండ్ ప్లేస్ లో టీమిండియా సంచలన స్టార్ కింగ్ కోహ్లీ ఉన్నారు. కోహ్లీ తన ఆటతో, సంపాదనతో ఎప్పుడూ ట్రెండ్ అవుతుంటాడు. పఠాన్, జవాన్, హిట్లతో ఫామ్ లోకి వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూడో ప్లేస్ లో, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ నాలుగో స్థానంలో, తమిళ స్టార్ దళపతి విజయ్ ఐదో స్థానంలో, ఆరో స్థానం లో రాహుల్ గాంధీ, ఏడో స్థానంలో మిస్టర్ కూల్ ధోని, ఎనిమిదో స్థానంలో రోహిత్ శర్మ, తొమ్మిదో స్థానంలో అక్షయ్ కుమార్, టాప్ టెన్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారు.