పవన్ కళ్యాణ్ గురించిన తాజా అప్డేట్

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం అజ్ఞాతవాసి షూటింగ్ నిన్న పూర్తిచేసుకుని ఈరోజు నుండే ప్రజల్లోకి జనసేన తరపున వారి కష్టాలని తెలుసుకునేందుకు వెళ్ళిపోయాడు.

ఇక సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన పూర్తిగా రాజకీయాల పైన దృష్టి సారించి సినిమాలని కొన్నిరోజులు ఆపేస్తాడు అని అంటున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఆయన ముందుగా ఒప్పుకున్నా ఎఏం రత్నం సినిమాని పక్కకి పెట్టి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక చిత్రం చేయనున్నాడట.

అయితే ఇంకొంతమంది మాత్రం ఆయన ఈ రెండు సంవత్సరాల పాటు సినిమాలకి దూరంగా ఉంటారు పూర్తిగా జనసేన పైనే దృష్టి నిలుపుతారు అని చెబుతున్నారు.

ఏదేమైనా.. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఆయన ఏం చేస్తాడు అన్నది ఎప్పటికి ఒక పెద్ద ప్రశ్నే...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS