వెయిట్ చేయమంటున్న పవన్ కళ్యాణ్

మరిన్ని వార్తలు

ప్రశ్నించాడానికే నేను ఉన్నది అని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అభిమానులని, కార్యకర్తలని కొద్దిగా ఓపిక పట్టమంటున్నాడు.

వివరాల్లోకి వెళితే, పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అంటూ ఆంధ్రప్రదేశ్ లోని కొందరు రాజకీయ నాయకులు ప్రశ్నించగా అలాగే పవన్ వ్యక్తిగత జీవితం పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఆయన తన అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి ఒక ట్వీట్ ద్వారా సందేశం పంపించాడు.

అదేంటంటే- ఇప్పుడిప్పుడే సంస్థాగతంగా బలపడుతూ, ప్రజాసమస్యల పై పోరాడుతున్న తమ పార్టీ పైన తన వ్యక్తిగతంగా బురదజల్లే కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి విమర్శల పైన ఎవరు స్పందించ వద్దు అని విజ్ఞప్తి చేశాడు. అయితే అటువంటి విమర్శలకు పార్టీ తగిన సమయంలో తగు సమధానం చెపుతుంది అని ఆ ప్రకటనలో తెలియచేశాడు.

మరి.. ఈ జనసేనాని లేఖకి ఆయన అభిమానులు, కార్యకర్తలు కట్టుబడి ఉంటారా లేదా అన్నది వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS