‘అల వైకుంఠపురములో..’ సినిమాతో బుట్టబొమ్మగా అందరి ప్రశంసలు దక్కించుకుంది ముద్దుగుమ్మ పూజా హెగ్దే. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా స్టార్ హీరోందరికీ ఫస్ట్ ఛాయిస్గా మారిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. అప్పుడెప్పుడో ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్కి పరిచయమైన పూజా హెగ్దేకి బోణీ అంతగా కలిసి రాలేదు. తర్వాత సౌత్కే పరిమితమైపోయిన పూజా హెగ్దే, మళ్లీ బాలీవుడ్పై దృష్టి పెట్టింది. ఆ క్రమంలోనే ఇటీవల ‘హౌస్ఫుల్ 4’లో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు మరోసారి అక్షయ్ కుమార్తో జత కట్టబోతోంది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న ‘బచ్చన్ పాండే’లో కృతిసనన్ మెయిన్ హీరోయిన్ కాగా, పూజా హెగ్దే మరో హీరోయిన్గా నటిస్తోంది. పర్హద్ శామ్జీ ఈ సినిమాకి దర్శకుడు. తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వీరమ్’కి హిందీ రీమేక్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఇకపోతే, బాలీవుడ్లో అక్షయ్కుమార్ హవా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ హిట్ అయ్యిందంటే, అది పూజా బాలీవుడ్ కెరీర్కి బాగా కలిసొస్తుందనాలి. అదే జరిగితే, ఇటు టాలీవుడ్లోనూ అటు బాలీవుడ్లోనూ కూడా పూజా దున్నేయడం ఖాయం. ప్రస్తుతం తెలుగులో ప్రబాస్ సినిమాలో నటిస్తోంది పూజా హెగ్దే.