న‌య‌న‌తార‌కు స‌వాల్ విసురుతున్న పూజా

మరిన్ని వార్తలు

ద‌క్షిణాదిన అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న క‌థానాయిక ఎవ‌రంటే... న‌య‌న‌తార పేరే చెబుతారంతా. సినిమాకి కోటి రూపాయ‌లు పారితోషికం తీసుకున్న తొలి క‌థానాయిక‌.. న‌య‌న‌తారే. ఇప్పుడు త‌న పారితోషికం 5 కోట్ల‌కు పైమాటే. అయితే.. త‌న‌వ‌న్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కాబ‌ట్టి, త‌న పేరు మీదే మార్కెట్ జ‌రుగుతుంది కాబ‌ట్టి, న‌య‌న‌కు 5 కోట్ల పారితోషికం ఇవ్వ‌డంలో త‌ప్పులేదు. అయితే ఇప్పుడు న‌య‌న‌తార‌ని బీట్ చేసేస్తోంది.. పూజా హెగ్డే.

 

సౌత్‌లో పూజా ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో విరివిగా సినిమాలు చేస్తోంది. రెండు చోట్లా తాను ఫుల్ బిజీ. త‌న పారితోషికం తాజాగా 3.5 కోట్లు దాటేసింద‌న్న‌ది టాక్‌. ఇటీవ‌ల నితిన్ - సురేంద‌ర్ రెడ్డి సినిమాకి ఓకే చెప్పింది పూజా. అందుకోసం ఏకంగా 3.5 కోట్లు అందుకుంద‌ని టాక్‌. ఈ సినిమాకి పూజా ఇచ్చిన కాల్షీట్లు కేవ‌లం 30 మాత్ర‌మే. న‌య‌న‌తార సినిమా అంతా క‌ష్ట‌ప‌డి 5 కోట్లు తీసుకుంటుంటే.. కేవ‌లం నెల రోజులు కేటాయించి రూ.3.5 కోట్లు అందుకోవ‌డం మామూలు విష‌యం కాదు. పూజా జోరు చూస్తుంటే, త్వ‌ర‌లోనే 5 కోట్ల రేంజు అందుకున్నా ఆశ్చ‌ర్యం లేదు. ద‌క్షిణాదిన అనుష్క, కాజ‌ల్, స‌మంత‌, త‌మ‌న్నా, ర‌ష్మిక‌లు మాత్ర‌మే 2 కోట్ల రేంజ్ దాటారు. స‌మంత కూడా ఇప్పుడు 3 కోట్లు డిమాండ్ చేస్తోంద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS