'రాధేశ్యామ్'ని రూ. 2కోట్లలో తీయొచ్చు : ప్రభాస్

మరిన్ని వార్తలు

మరికొద్ది గంటల్లో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా 'రాధేశ్యామ్' థియేటర్ లోకి వస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాని రాజమౌళి లాంటి ప్రముఖులు చూశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగంగా రాజమౌళి, ప్రభాస్ తో ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఈ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. సినిమాలోని కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ గురించి ప్రేక్షకులకు ఆసక్తి పెరిగేలా మాట్లాడారు. ఇదే సందర్భంలో రాధే శ్యామ్ స్టోరీ లైన్ పై కూడా చర్చ వచ్చింది. 'రాధేశ్యామ్' స్టోరీని రాజమౌళి విశ్లేషించిన విధానం ఆసక్తికరంగా వుంది. ''రాధేశ్యామ్ ఒక ఎమోషనల్ లైన్. చాలా స్ట్రాంగ్ గా వుంటుంది. అయితే అదే లైన్ ని చిన్న సినిమాగా కూడా తీయొచ్చు. మరి ఇంత పెద్ద సినిమాగా చేయాలని ఎక్కడ అనిపించింది?'' అని ప్రభాస్ ని ప్రశ్నించారు రాజమౌళి.

 

ఈ ప్రశ్నకు ప్రభాస్ కూడా చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. '' నిజమే రాధేశ్యామ్ కథని రెండు కోట్లలో కూడా తీయొచ్చు. అయితే దర్శకుడు ఆ కథ చెప్పిన తర్వాత గ్రాండ్ గా వుంటే బావుంటుందని అనిపించింది. షిప్, ట్రైన్ ఎపిసోడ్లు రిచ్ గా చేయాలనీ భావించాం. నిర్మాతలు కూడా కుదిరారు. అలా రాధే శ్యామ్ పెద్ద సినిమా అయ్యింది'' అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఈ సినిమా గురించి ఎవరు చెప్పిన షిప్ , ట్రైన్ ఎపిసోడ్లు గురించే చెబుతున్నారు. రాజమౌళి కూడా ఆ రెండు ఎపిసోడ్లు సినిమాకి కీలకమని అభిప్రాయపడ్డారు. రాధేశ్యామ్ యూనిట్ అంత ఆసక్తిగా చెబుతున్న ఆ ఎపిసోడ్లు మరి కొద్ది గంటల్లో ప్రేక్షకులు చూడబోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS