ప్రభాస్ కొత్త సినిమా త్వరలో ప్రకటించబోతున్నారా?

మరిన్ని వార్తలు

ప్రభాస్ 'సాహో' చిత్రం వచ్చి సంవత్సరం దాటింది. తర్వాత చిత్రం ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే యంగ్ రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయిన ప్రభాస్.. ఇక ఏ సినిమా ఒప్పుకున్నా అది భారీగా ఉండాల్సిందే లేదా పాన్ ఇండియా చిత్రం అయ్యుండాల్సిందే. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పలు చిత్రాలు ఒప్పుకున్నాడు.. వాటి ఎనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయాయి. వాటిలో మొదటిది రాధా కృష్ణ దర్శకత్వం లో రానున్న 'రాధే శ్యామ్'. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతుంది. దీనితో పాటు వైజయంతి బ్యానర్ లో 'నాగ్ అశ్విన్' తో ఓ చిత్రం, మరియు 'తానాజీ' చిత్ర దర్శకుడు 'ఓం రౌత్' దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే చిత్రం కూడా ప్రకటించేశారు.

 

ఇక పోతే 2018 చివర్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన 'కేజిఎఫ్', కన్నడ సినిమా స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఈ చిత్రానికి 'ప్రశాంత్ నీల్' దర్శకత్వం వహించాడు. అయితే ప్రస్తుతం ఆ దర్శకుడు 'కేజిఎఫ్ 2'వ భాగం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత తెలుగులో ఒక చిత్రం చేస్తాడని, ఆ మేరకు పలు తెలుగు నిర్మాత నుండి భారీ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ప్రశాంత్ తీయబోయే తదుపరి చిత్రం ప్రభాస్ తోనే ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రం ప్రశాంత్ కన్నడలో తీసిన తొలి చిత్రం 'ఉగ్రం' కథను బేస్ చేసుకుని ఉండబోతుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రాబోతుందని సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS